నిజజీవితంలో జరిగిన ఘటనలను ఆధారంగా చేసుకుని టాలీవుడ్లో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ కనెక్ట్ అవుతుంటారు.తాజాగా ఇలాంటి కోవలోనే వస్తున్న వెబ్ సిరీస్ ‘షూటౌట్ అట్ ఆలేర్’.
వాస్తవంగా జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.కాగా ఓటీటీ ప్లాట్ఫాంలో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ను మెగాస్టార్ చిరంజీవి పెద్దకూతురు సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ వెబ్ సిరీస్లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ నటిస్తుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో సైతం మంచి బజ్ ఏర్పడింది.
అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన ట్రైలర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ ట్రైలర్ చూస్తుంటే ఇది పక్కా క్రైమ్ థ్రిల్లర్గా రాబోతున్నట్లు కనిపిస్తుంది.2015 ఏప్రిల్ 7న ఆలేరులో జరిగిన వికారుద్దీన్ ఎన్కౌంటర్ నేపథ్యం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కించాడు దర్శకుడు ఆనంద్ రంగా.గతంలో ‘ఓయ్’ అనే సినిమాను తెరకెక్కించిన ఆయన ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ ట్రైలర్లోనే కథ పూర్తిగా తెలపడంతో ఈ సిరీస్పై ఆసక్తిని మరింత పెంచేశాడు దర్శకుడు.
ఇక ఈ వెబ్ సిరీస్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం జీ5లో 8 ఎపిసోడ్స్గా స్ట్రీమ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ వెబ్ సిరీస్లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్లు పోలీస్ ఆఫీసర్లుగా కనిపిస్తుండగా, నందిని రాయ్, నిహారికా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.
అయితే ఈ వెబ్ సిరీస్లో మెగాస్టార్ చిరంజీవి ఓ కేమియో పాత్రలో కనిపిస్తారనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.మరి మెగాస్టార్ కూతురు సుష్మిత నిర్మాతగా మారి చేస్తున్న తొలి ప్రయత్నం ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
ఇక క్రిస్మస్ కానుకగా ఈ వెబ్ సిరీస్ను డిసెంబర్ 25న ప్రీమియర్ స్ట్రీమ్ చేయనున్నట్లు జీ5 వెల్లడించింది.