సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ చివరి షెడ్యూల్ ప్రారంభం అయ్యింది.రెండు మూడు వారాల్లో షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉంది.
సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు చేయబోతున్న సినిమా ఏంటీ అనేది ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబో లో ఆ సినిమా రూపొందుతోంది.
వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు అతడు మరియు ఖలేజాలు చాలా స్పెషల్ మూవీస్ అనడంలో సందేహం లేదు.తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆ సినిమాలు ఉంటాయి అనేంతగా బుల్లి తెరపై ఆ సినిమాలను కొన్ని వందల సార్లు టెలికాస్ట్ చేయడం జరిగింది.
అంతగా ఆ సినిమాలను బుల్లి తెర ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం జరిగింది.ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుంది.
ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా మొత్తం ప్లాన్ మార్చేశారు.సర్కారు వారి పాట చిత్రీకరణ పూర్తి అయిన తర్వాతే త్రివిక్రమ్ కు డేట్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆ సినిమాను స్పీడ్ గా ముగించే పనిలో ఉన్నాడు.ఇటీవలే స్పెయిన్ షెడ్యూల్ ను ముగించిన మహేష్ బాబు హైదరాబాద్ లో హడావుడిగా చిత్రీకరణ మొదలు పెట్టాడు.ఇక త్రివిక్రమ్ మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలకు డిసెంబర్ 21 ను ఖరారు చేయడం జరిగిందట.
అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.రెగ్యులర్ షూటింగ్ ను సంక్రాంతి తర్వాత చేయబోతున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ శివారులో సెట్టింగ్ నిర్మాణం జరుగుతోంది.సినిమా లోని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరించబోతున్నారట.
మొత్తానికి వీరి కాంబో మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి.మరి సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.