మీ దగ్గర రూపాయి పాత రూపాయి కాయిన్లు, 50 పైసలు నాణేలు ఉన్నాయా? అయితే మీరు ఈ స్టోరీ వినాల్సిందే.ఇకనుండి కొన్నిరూపాయి, 50 పైసలు నాణేలు కనబడని మీకు తెలుసా? ఈ విషయమై ప్రైవేట్ రంగ బ్యాంక్ అయినటువంటి ICICI Bank తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చింది.న్యూఢిల్లీలోని ఒక ICICI బ్యాంక్ బ్రాంచ్ కొన్ని రూపాయి నాణేలు, 50 పైసలు కాయిన్లను రీఇష్యూ చేయడం కుదరదని తేల్చి చెప్పింది.అంటే ఒక్కసారి ఆ రకమైన రూపాయి, 50 పైసలు నాణేలు సదరు బ్యాంక్లోకి వెలితే.
మళ్లీ తిరిగి వెనక్కి రావన్నమాట.
అయితే వాటి రూపంలో కొత్త కాయిన్లు మీకు లభిస్తాయి.
RBI (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఈ నాణేలను తిరిగి బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకుంటుంది.అయితే మీరు ఈ కాయిన్లు చెల్లుబాటు కావని మాత్రం అనుకోవడానికి లేదు.
ఇవి వ్యవస్థలో ఉన్నంత వరకు చెల్లుబాటు అవుతూనే ఉంటాయి.ఒక్కసారి బ్యాంక్లోక వెలితే మాత్రం ఇక బయటకు రావు.బ్యాంక్లోని వెళ్లిన తర్వాత వాటిని RBI తీసేసుకుంటుంది.1990, 2000 సంవత్సరాల్లో చెలామణిలో ఉన్న పాత కాయిన్లను బ్యాంకులు రిఇష్యూ చేయడం లేదు.
అయితే ఇక్కడ ఏ రకమైన కాయిన్లను రీఇష్యూ చేయడం లేదో ఒకసారి తెలుసుకుందాం.రూ.1 కాపర్ నికెల్ నాణేలు, 2.25 పైసల కాపర్ నికెల్ నాణేలు, 10 పైసల స్టెయిన్లెస్ స్టీల్ నాణేలు, 10 పైసల అల్యూమినియం కాంస్య నాణేలు, 20 పైసల అల్యూమినియం నాణేలు, 10 పైసల అల్యూమినియం నాణేలు, 5 పైసల అల్యూమినియం నాణేలు మరలా ఇష్యు చేయబడవు.ఈ కాయిన్లను బ్యాంకులు తిరిగి వెనక్కి జారీ చేయడం లేదు.అందువల్ల మీ దగ్గర ఈ కాయిన్లు ఉంటే ఈ విషయాన్ని తెలుసుకోవడం ఉత్తమం.అయితే బ్యాంక్ నోటీసు ప్రకారం.ఈ కాయిన్లు ఎప్పటిలాగానే చెల్లుబాటు అవుతాయని గుర్తించాలి.