పర్యాటక ప్రాంతాలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం.ప్రకృతి అందాలను ప్రతిఒక్కరూ ఆస్వాదిస్తుంటారు.
ఇక ఎత్తయిన కొండలు, పర్వతాలను అధిరోహించాలని చాలా మందికి ఉంటుంది.కొంత మంది ఎత్తయిన కొండలపై నుంచి విన్యాసాలు కూడా చేస్తుంటారు.
కొండపై నుంచి దూకడం లాంటి సాహసాలు విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు.ఇటువంటి విన్యాసాలు చాలా ప్రమాదకరమైనవి.
ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
రష్యాలోని డాగేస్తాన్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది.
ఈ పర్యాటక ప్రాంతంలో 6300 అడుగుల ఎత్తయిన కొండ అంచున సులక్ కాన్యన్ను ఏర్పాటు చేశారు.పర్యాటకులు కొండ అంచు నుంచి కింద ఉన్న లోయ మీదుగా ఉయ్యాల ఊగుతూ థ్రిల్ పొందుతుంటారు.
అలా కొండ అంచున ఇద్దరు మహిళలు ఊయల ఊగుతుండగా గొలుసు ఊడి, వారు కొండ అంచు నుంచి కిందపడిపోయారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
అయితే అదృష్టం బాగుండి వారు ప్రాణాలతో బయటపడ్డారు.ఈ షాకింగ్ ఘటన రష్యాలోని డాగేస్తాన్ లో జరిగింది.
ఈ వీడియోలో ఇద్దరు మహిళలు చెక్క ఉయ్యాలపై కూర్చుని ఉన్నారు.వెనుక నుంచి ఒక వ్యక్తి ఉయ్యాలను ఊపుతుంటాడు.అలా కొద్దిసేపు వారు బాగానే ఎంజాయ్ చేశారు.కొంత సేపటి తర్వాత ఆ ఉయ్యాల గొలుసులు ఊడిపోయాయి.దీంతో దానిపై కూర్చున్న ఇద్దరు మహిళలు కొండ అంచు నుంచి కింద పడిపోయారు.అయితే అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు.
అక్కడున్న సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో స్వల్పంగా గాయాలయ్యాయి.అయితే ఈ ఘటనపై దర్యాప్తు జరపడంతో పర్యాటకుల ప్రాణాలకు ఎలాంటి హాని కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.
ఈ భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.