ప్రస్తుతం తెలుగులో బుల్లితెరపై నంబర్ 1 సీరియల్ ఏదంటే ఎవరైనా సరే ఠక్కున కార్తీకదీపం సీరియల్ అని చెప్పేస్తారు.స్టార్ మా ఛానెల్ లో ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ ప్రధాన పాత్రల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.స్టార్ హీరోల సినిమాల కంటే ఎక్కువ టీఆర్పీ రేటింగులు సాధిస్తూ గత కొన్నేళ్లుగా స్టార్ మా ఛానల్ ను నంబర్ 1 స్థానంలో నిలబెడుతోంది కార్తీక దీపం సీరియల్.
2017 సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు త్వరలో ఎండ్ కార్డ్ పడబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.మూడేళ్ల పాటు విజయవంతంగా ప్రసారమైన ఈ సీరియల్ ను మంచి టీఆర్పీ రేటింగ్స్ తోనే ముగించాలని ఈ సీరియల్ నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది.సీరియల్ ను మరింత సాగదీస్తే ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉందని కార్తీకదీపం నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సీరియల్ లో చోటు చేసుకుంటున్న మలుపులు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.మరోవైపు ప్రేమీ విశ్వనాథ్ త్వరలో ఒక సినిమాలో నటించబోతున్నట్టు వస్తున్న వార్తలు కూడా ఈ ప్రచారం నిజమేనేమో అని నమ్మేలా చేస్తున్నాయి.
అయితే ఛానల్ నిర్వాహకుల నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మరోవైపు స్టార్ మా ఛానెల్ లో ప్రైమ్ టైమ్ లో ప్రసారమవుతున్న ఇతర సీరియళ్లు సైతం మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటున్నాయి.
అయితే కార్తీకదీపం సీరియల్ ను ముగిస్తే మాత్రం వంటలక్క అభిమానులకు అది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.ఈ సీరియల్ ముగిస్తే ఈ సీరియల్ టైమ్ లో ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న హిట్ సీరియల్ ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.