అక్కినేని సమంత ప్రస్తుతం ఓటిటి ఆహాలో సామ్ జామ్ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఒక వైపు సినిమాలు మరో వైపు ఫ్యామిలీ తో సమయాన్ని గడిపేస్తూ.
ఫుల్ బిజీగా ఉంటుంది సమంత.ఇటీవల కాలంలో అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా కోసం షూటింగ్ కోసం వెళ్లగా బిగ్ బాస్ హౌస్ హోస్ట్ గా కూడా చేసిన సంగతి తెలిసిందే.
ఇక సామ్ జామ్ ప్రోగ్రాం ద్వారా తనదైన రీతిలో సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుంటుంది.మొదటగా సామ్ జాబ్ తొలి ట్రైలర్ విడుదల అవ్వగానే.
ప్రేక్షకులలో బాగా అంచనాలు ఉండగా షో ప్రారంభమైన అనంతరం ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు అన్న వార్తలు రావడం మనం గమనిస్తూనే ఉన్నాం.ఇందుకు ఒక కారణం కూడా లేకపోలేదు.
ఈ ప్రోగ్రాం టీవీ చానల్స్ లో ప్రసారం అవ్వకపోవడం.అంతేకాకుండా ఆహా ఓటిటిలో ఇంటర్వ్యూలు చేసే సెలబ్రిటీలు ఎక్కువగా మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ వారు ఉండడమే.
ఈ ఫ్యామిలీస్ కు చెందిన వారే ఎక్కువగా ఉండడంతో ఈ ప్రోగ్రాం పై కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ పడిందని కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరికొంతమంది అయితే ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ తో దీన్ని పోల్చడం జరిగింది.ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా ఉన్న ఆలీ పాతతరం వారి నుంచి కొత్తతరం వారితో అందరితో పరిచయాలు ఉండటంతో అలాగే ప్రోగ్రాం లో అడిగే ఇంటర్వ్యూలను అందరి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.పైగా ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ముగిస్థునట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి పది ఎపిసోడ్లు ప్లాన్ చేయగా 8 ఎపిసోడ్ ఈ షో కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు ఆహా టీమ్ అనుకున్నట్లు తెలుస్తోంది.
చివరి ఎపిసోడ్ కి సమంత భర్త నాగచైతన్యను ఇంటర్వ్యూ చేసి శుభం కార్డు పలకబోతుందట.అలాగే అంతకంటే ముందు ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తో చిట్ చాట్ ప్రేక్షకుల నుంచి సరైన రెస్పాన్స్ అందుకోలేకపోయింది.
అలాగే ఈ ఎపిసోడ్ రేటింగ్స్ చూసి ఆహా సంస్థ వారు నిరాశ పడ్డారట.ఇలా రేటింగ్స్ పడిపోవడానికి మరో ముఖ్య కారణం.ఆహా లో కేవలం తెలుగు సంబంధించిన కంటెంట్ మాత్రమే వీక్షించే అవకాశం ఉండడంతో చాలామంది ప్రేక్షకులు ఆహా యాప్ చూడటానికి ఇష్టపడలేదు.సాధారణమైన ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో సమంత కాస్త వెనకబడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.