పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన మరో పెద్ద నోటు రెండు వేల నోటు.దీనికి పెద్ద ఎత్తున ముద్రించారు.
కొన్నాళ్ల తర్వాత దీనికి తొలగిస్తారని, రద్దు చేస్తారని ప్రచారం జరిగింది.కాని నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా రెండు వేల నోట్లను అలాగే కొనసాగిస్తూనే ఉన్నారు.
కొత్త నోట్ల ను ముద్రిస్తున్నారు.రెండు వేల నోట్లు ఎక్కువగా బ్లాక్ మనీ అయ్యి ఉన్న వారి చెంతకు చేరాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయినా కూడా రెండు వేల నోట్లకు కొదువ లేకుండా పోయింది.
రెండు వేల రూపాయల నోట్ల కట్టలు ఉన్న వారి ఖజానాకు వెళ్లినా కూడా ఇంకా ఇన్ని రెండు వేల నోట్లు ఎలా ఉన్నాయంటూ ఆర్బీఐ వారు కూడా నోరు వెళ్లబెడుతున్నారు.
ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం చెలామనిలో ఉన్న మొత్తం రెండు వేల నోట్లలో దాదాపుగా 56 శాతం నకిలీవే అంటున్నారు.అంటే అసలు కంటే నకిలీవే ఎక్కువ.
ఇది చాలా ప్రమాదకరం.భారత ఆర్థిక వ్యవస్థను ఇది నాశనం చేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.