ఈమధ్యకాలంలో ఎలాంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే వున్నాయి.దానికి కారణం సోషల్ మీడియా అనే చెప్పుకోవాలి.
ఈ సోషల్ మీడియా లేకుంటే ఇలాంటి సంఘటనలు కాలగర్భంలో కలిసిపోయేవి.ఇక తాజా సంఘటనను ఓసారి చూస్తే, ఓ రెస్టారెంట్ ఫుడ్ను టేస్ట్ చేసేందుకు వెళ్లిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది.
ఆర్డర్ చేసిన ఫుడ్లో.ఓ ఇనుప వస్తువు కనిపించడంతో అయోమయానికి గురి అయ్యింది.
ఆ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బందికి తెలియజేయగా.వాళ్ల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఆమెకి దిమ్మతిరిపోయింది.
దీంతో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది.
ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసినట్లయితే, మలేషియాకు చెందిన ఓ మహిళ.
వీకెండ్లో సరదాగా కాలక్షేపం చేసే భాగంలో స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్ను విజిట్ చేసింది.అనంతరం Fish Curryతో కూడిన భోజనాన్ని ఆర్డర్ చేసింది.
వెయిటర్ తీసుకొచ్చిన ఫుడ్ను ఆస్వాదిస్తూ తినడం ప్రారంభించింది.ఈ నేపథ్యంలో చేప తల తింటుండగా అందులో ఓ ఇనుపచువ్వ కనిపించింది.
అది చూసి ఒక్కసారిగా ఆమె ఆశ్చర్యపోయింది.వెంటనే సిబ్బందిని పిలిచి విషయం చెప్పింది.
అయితే వాళ్లు దాన్ని లైట్ తీసుకోవడంతో వాదనకు దిగింది.
దీంతో సదరు రెస్టారెంట్ మేనేజర్ కలజేసుకున్నాడు.ఆమెకు జరిగిన చేదు అనుభవానికి క్షమాణ చెప్పి, బిల్లులో డిస్కౌంట్ ఇస్తామనడంతో ఆమె కాస్త శాంతించింది.అక్కడే అసలు ట్విస్ట్ ఉందని ఆమె గమనించలేదు.
ఈ క్రమంలోనే చివరకు బిల్ అందుకున్న ఆమె.అందులో రెస్టారెంట్ తనకు ఇచ్చిన డిస్కౌంట్ చూసి ఖంగుతింది.తనకు కలిగిన అసౌకర్యానికి రెస్టారెంట్ సిబ్బంది.కేవలం ఒక్క రూపాయికి సమానమైన డిస్కౌంట్ ఇవ్వడంతో షాకైంది.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.ఆ బిల్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.దీంతో నెటిజన్లు ఆ హోటల్ వారిని తిట్టిపోస్తున్నారు.
తాజా వార్తలు