టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనాలకు మనం అబద్ధాలు చెప్పినా నిజాలు కనిపిస్తాయని నిజాలు చెప్పినా అబద్ధాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే నా ఉద్దేశంలో పెద్ద మెసేజ్ అని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
చిన్నప్పుడు పెద్ద సైంటిస్ట్ కావాలని అనుకున్నానని సుకుమార్ కామెంట్లు చేశారు.
లెక్చరర్ గా వచ్చే రెస్పెక్ట్ ను నేను బాగా ఎంజాయ్ చేస్తానని 7 సంవత్సరాలు నేను లెక్చరర్ గా పని చేశానని ఆయన తెలిపారు.
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొత్త షర్ట్ కొనుక్కోవాలన్నా ఆలోచించే పరిస్థితి ఉండేదని ఆయన అన్నారు.జగడం ఫ్లాప్ అయిన సమయంలో నన్ను ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారని సుకుమార్ కామెంట్లు చేయడం గమనార్హం.
రాజమౌళి గారు నేను గొప్ప పోటీ అని చెప్పడం ఎంతో సంతోషం కలిగించిందని ఆయన కామెంట్లు చేశారు.
జగడం సినిమా సమయంలో రాజమౌళి ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారని ఆయన తెలిపారు.
రాజమౌళి గారి మాటలు నాకు టానిక్ లా పని చేశాయని ఆయన పేర్కొన్నారు.ప్రతి మనిషి రకరకాల ఎమోషన్స్ కలయిక అని ఆయన కామెంట్లు చేశారు.
మనిషి ఫిజికల్ స్టేటస్ సైకలాజికల్ స్టేటస్ డిసైడ్ అవుతుందని ఆయన తెలిపారు.అ అంటే అమలాపురం సినిమాతో ఆర్య సినిమా ప్రేక్షకులకు ఎక్కువగా రీచ్ అయిందని సుకుమార్ తెలిపారు.
ఐటమ్ సాంగ్ పెడితే బిజినెస్ పరంగా ప్లస్ అవుతుండటంతో అలా చేస్తున్నానని ఆయన వెల్లడించారు.
సుకుమార్ ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉన్నారు.భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.రికార్డ్ స్థాయి బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
పుష్ప ది రైజ్ ను మించి ఈ సినిమా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.