సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణం రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులను షాక్ కు గురి చేసింది.కృష్ణ అంతిమ యాత్ర ప్రారంభం కాగా కృష్ణను చివరిసారి చూసిన ఫ్యాన్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.
పద్మాలయ స్టూడియో నుంచి కృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమయింది.కడసారి వీడ్కోలుకు భారీ సంఖ్యలో కృష్ణ ఫ్యాన్స్ హాజరయ్యారు.
నిర్మాతల బాగు కోరే అతికొద్ది హీరోలలో కృష్ణ ఒకరని చాలామంది నిర్మాతలు అభిప్రాయపడ్డారు.
కృష్ణ లేని లోటు ఎవరూ తీర్చలేనిదని ఆయన మళ్లీ పుట్టాలంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
తాతయ్య నాకు ఎన్నో విషయాలను నేర్పించారని ఇకపై ఇంతకు ముందులా ఉండదని సితార ఎమోషనల్ అయ్యారు.తాతయ్య జ్ఞాపకాలు నా మెమొరీలో అలాగే నిలిచిపోతాయని సితార కామెంట్లు చేశారు.
తాతతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సితార ఈ విషయాలను వెల్లడించారు.
మరోవైపు కృష్ణ ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కృష్ణ తన ఆస్తులు మనవళ్లు, మనవరాళ్లకు చెందేలా వీలునామా రాశారని సమాచారం.కృష్ణ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు కాగా దానధర్మాలు చేయడం వల్ల ఆయన ఆస్తుల విలువ తగ్గిందని సమాచారం.వీకే నరేష్ కు మాత్రం కృష్ణ వీలునామాలో ఎలాంటి ఆస్తులు రాయలేదని తెలుస్తోంది.
నాన్నమ్మ తాతయ్య కొన్ని రోజుల గ్యాప్ లో చనిపోవడంతో సితార, గౌతమ్ వెక్కివెక్కి ఏడ్చారు.ఆప్తులైన వారు ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉండటం మహేష్ బాబును ఎంతగానో బాధ పెడుతోంది.తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం మహేష్ బాబు పైనే ఉంది.
మనవళ్లు, మనవరాళ్లకు న్యాయం జరగాలని కృష్ణ ఆస్తులను వాళ్లకే రాసిచ్చారని సమాచారం.కృష్ణ ఆత్మ శాంతించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.