ఈతరం హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు తమ సినీ కెరీర్ లో 50 కంటే ఎక్కువ సినిమాలలో నటించడం కష్టం అవుతోంది.అయితే హీరోయిన్ సౌందర్య మాత్రం ఏకంగా 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించి సక్సెస్ లను అందుకోవడంతో పాటు ఫ్యాన్స్ ను మెప్పించారు.
జగపతిబాబు, సౌందర్య కాంబినేషన్ లో తెరకెక్కిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే.ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడుతూ జగపతిబాబు అంత పెద్ద ఆర్టిస్ట్ అవుతాడని అనుకోలేదని తెలిపారు.
హీరో పాత్ర చాలా సులువుగా చేయొచ్చని విలన్ పాత్ర చేయడం సులువు కాదని ఆయన కామెంట్లు చేశారు.జగపతిబాబు ఎవరైనా షూటింగ్ కు ఫ్రెండ్స్ వస్తే సొంత డబ్బులు ఖర్చు చేసేవారని రామారావు అన్నారు.
జగపతిబాబు ప్రొడ్యూసర్ పై భారం పడకుండా చూసుకునేవారని ఆయన తెలిపారు.
సౌందర్య జగపతిబాబుకు మంచి స్నేహితురాలు అని రామారావు చెప్పుకొచ్చారు.
సౌందర్య అకాల మరణం వల్ల నేను చనిపోవాలని అనుకున్నానని జగపతి బాబు ఒక సందర్భంలో చెప్పాడని ఆయన కామెంట్లు చేశారు.సౌందర్య లాంటి ఫ్రెండ్ పోయిన తర్వాత నేనెందుకు ప్రాణాలతో ఉండాలని అనిపించిందని రామారావు అన్నారు.
జగపతిబాబు ఎక్కువగా ఖర్చు చేసేవారని ఆయన తెలిపారు.
జగపతిబాబు ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారని రామారావు వెల్లడించారు.విలన్ అయిన తర్వాత జగపతిబాబుకు ఆఫర్లు పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.జగపతిబాబు మంచితనం ఆయనను కాపాడిందని రామారావు పేర్కొన్నారు.
ఇమంది రామారావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జగపతిబాబు ప్రస్తుతం వరుస సినీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతిబాబు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.జగపతిబాబుకు ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.