బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయకు బుల్లితెరపై ఆఫర్లు అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే.జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పిన అనసూయ ఇతర ఛానెళ్లలో వరుస ఆఫర్లతో బిజీ అవుతారని అందరూ భావించగా అందుకు భిన్ననంగా జరుగుతుండటం గమనార్హం.
మరోవైపు గతంలో అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.అయితే అనసూయ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు మాత్రం రావడం లేదు.
మరోవైపు ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా అనసూయ వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే.అనసూయ ఏ పోస్ట్ పెట్టినా నెటిజన్ల నుంచి ఊహించని స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి.
అయితే వైరల్ అవుతున్న కామెంట్లు అనసూయ ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నాయని సమాచారం అందుతోంది.అయితే అనసూయ జాతకంలో దోషాలు ఉన్నాయని అందుకే ఆమెకు ఈ విధంగా జరుగుతోందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
అనసూయ ఆ దోషాలకు పరిహారం చేయించుకుంటే మాత్రమే ఆమె జాతకం మారే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అనసూయకు సైతం దైవ భక్తి ఎక్కువేననే సంగతి తెలిసిందే.వైరల్ అవుతున్న వార్తల విషయంలో అనసూయ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలే అనసూయ కెరీర్ ను డిసైడ్ చేయనున్నాయి.అనసూయ వెండితెరపై ఎన్ని ఆఫర్లు వస్తున్నా బుల్లితెరకు కూడా తగినంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అనసూయ కెరీర్ విషయంలో పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.
అయితే కొన్ని చిన్నచిన్న తప్పుల వల్ల ప్రేక్షకుల్లో ఆమెపై నెగిటివిటీ ఏర్పడుతోంది.జబర్దస్త్ షో, సినిమాల ద్వారా యాంకర్ అనసూయ భారీ స్థాయిలోనే సంపాదించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.