మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ దిశాపటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో ఏ విధమైనటువంటి అవకాశాలను అందుకోలేకపోయింది.
ఈ క్రమంలోనే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురైంది.
సాధారణంగా హీరోయిన్లు వారి గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటారు.ఈ విషయంలో దిశాపటాని కూడా ఏమాత్రం తగ్గేదే లే అన్నట్టుగా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
అయితే తాజాగా ఈ డ్రెస్ విషయంపై దిశాపటాని ఎన్నో నెగెటివ్ కామెంట్లను ఎదుర్కోవలసి వస్తుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎయిర్ పోర్టులో మీడియా కంట పడింది.
దీంతో ప్రముఖ ఫోటోగ్రాఫర్ మానవ్ మంగ్లానీ క్లిక్ మనిపించిన ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఫోటోలో బ్రౌన్ కలర్ టాప్, బ్లూ రిప్డ్ జీన్స్ వేసుకొని ఉంది.
దీంతో వైరల్గా మారిన ఈ ఫోటో పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ డ్రెస్సులో అచ్చం పోకిరిలా ఉన్నావు అంటూ కామెంట్లు చేయగా.మరొక నెటిజన్ స్పందిస్తూ నా దేశానికి ఏమైంది… అందరూ ఇలాంటి చిరిగిన బట్టలు ధరించి తిరుగుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.మరొక నెటిజన్ అయితే ఏకంగా అడుక్కునే వాళ్లు కూడా ఇలాంటి బట్టలు ధరించరు అంటూ దారుణంగా కామెంట్లు చేశారు.
ఇలా ప్రతిసారి ఒళ్ళు మొత్తం చూపిస్తారు ఎందుకు అంటూ ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు.మొత్తానికి దిశాపటాని ధరించిన ఈ డ్రెస్ కారణంగా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ గురైంది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ దిశాపటాని నటించిన ఎమ్మెస్ ధోని, బాఘి2 సినిమాలకు ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకున్నారు.
కెరీర్లో ఎన్నో మంచి కథలను ఎంపిక చేసుకుని తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకొని దిశా పటాని ఇలాంటి దారుణమైన ట్రోలింగ్ కి గురైంది.