ఈ మధ్య రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగు తున్నాయి.మనం ఇప్పటి వరకు చాలా రకాల రోడ్డు ప్రమాదాలు చూసే ఉంటారు.
రోడ్డు మీద సీసీటీవీ కెమెరాలు ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగిన వీడియోలు అప్పుడప్పుడు బయటకు వస్తున్నాయి.వాటిని చుస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
నిముషాల్లో ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉంటాం.
ఆ ప్రమాదాలు జరిగిన తీరు వీడియోల్లో చుస్తే షాకింగ్ గా అనిపిస్తుంది.
మనం చేసే చిన్న నిర్లక్యం ఎంత పెద్ద ప్రమాదంలో పడేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి అలా చేయకపోతే మనతో పాటు పక్కన వెళ్లే వారికి కూడా చాలా ప్రమాదం.
తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఒక ఘటన వీడియో రూపంలో బయటకు వచ్చింది.
ఇది అసలు అనుకోకుండా జరిగింది.
అసలు ఈ ఘటన చుస్తే ఆశ్చర్య కలుగుతుంది.అక్కడ ఒక ప్రమాదకరమైన మలుపు ఉన్న రోడ్డు ఉంది.
అక్కడ అనుకోకుండా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆ మలుపు దగ్గరకు ఒక బస్సు వచ్చింది.అదే సమయంలో ఒక స్కూటీ కూడా వచ్చింది.ఆ స్కూటీ నడిపేవారు ఆ బస్సును చూసి టెన్షన్ పడి రోడ్డు పక్కకు స్కూటీ ఆపారు.
ఆ స్కూటీ బాలన్స్ అవ్వక పక్కకు పడిపోయింది.అంతలోనే మరొక బైక్ నడిపే వ్యక్తి కూడా రావడంతో ఆ స్కూటీ వాళ్ళను సడన్ గా చూడడంతో వాళ్ళు కూడా కంగారుగా రోడ్డు పక్కనే ఆపాడు.
అయితే ఇక్కడ ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటంటే.వెనుక బైక్ మీద వచ్చిన వారు పక్కనే ఉన్న లోయలో బైక్ ఒరిగి పడిపోయారు.ఈ ఘటనలో ఎవ్వరికి ప్రాణాపాయం లేదు కాబట్టి అంత ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది.