ముంబై ఇండియన్స్ కు షాక్....స్వదేశానికి వెళ్లిపోనున్న మలింగ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పన్నెండో సీజన్ మొదలైన సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో కూడా అన్నీ టీమ్స్ కూడా తమ శక్తికి మించి పోరాడుతూ విజయాలను అందుకుంటున్నాయి.

 Shock To Mumbai Indians-TeluguStop.com

అయితే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు మాత్రం గట్టి షాక్ తగిలింది.ఆ జట్టు స్టార్ పేసర్,లంక క్రికెటర్ లసిత్ మలింగ ఆ జట్టుకు షాక్ ఇచ్చాడు.

లంక వరల్డ్ కప్ జట్టును ఎన్నుకునేందుకు ఏప్రిల్ 4 న ప్రారంభమయ్యే సూపర్ ప్రోవినిషియల్ వన్డే టోర్నీ కోసం మలింగ స్వదేశానికి వెళ్లనున్నారు.ఈ మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు మలింగ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.

దీనితో ఈ సారి ఐపీఎల్ సీజన్ లో అతడు తిరిగి అడుగుపెట్టే అవకాశాలు లేవు అన్నమాట.ఈ రోజు వాంఖడే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ కు మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

కానీ ఈ మ్యాచ్ కు మలింగ అందుబాటులో లేడు.ఈ రోజే(బుధవారమే)మలింగ స్వదేశానికి తిరిగి రానున్నాడని లంక చీఫ్ సెలక్టర్ అశాంత తెలిపారు.

నాలుగు జట్లు పాల్గొనే ఈ టోర్నీ ఏప్రిల్ 4 నుంచి 11 వరకు జరగనుంది.గాలే జట్టుకు మలింగ సారధ్య భాద్యతలు నిర్వహించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube