ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పన్నెండో సీజన్ మొదలైన సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో కూడా అన్నీ టీమ్స్ కూడా తమ శక్తికి మించి పోరాడుతూ విజయాలను అందుకుంటున్నాయి.
అయితే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు మాత్రం గట్టి షాక్ తగిలింది.ఆ జట్టు స్టార్ పేసర్,లంక క్రికెటర్ లసిత్ మలింగ ఆ జట్టుకు షాక్ ఇచ్చాడు.
లంక వరల్డ్ కప్ జట్టును ఎన్నుకునేందుకు ఏప్రిల్ 4 న ప్రారంభమయ్యే సూపర్ ప్రోవినిషియల్ వన్డే టోర్నీ కోసం మలింగ స్వదేశానికి వెళ్లనున్నారు.ఈ మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు మలింగ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.
దీనితో ఈ సారి ఐపీఎల్ సీజన్ లో అతడు తిరిగి అడుగుపెట్టే అవకాశాలు లేవు అన్నమాట.ఈ రోజు వాంఖడే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ కు మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.
కానీ ఈ మ్యాచ్ కు మలింగ అందుబాటులో లేడు.ఈ రోజే(బుధవారమే)మలింగ స్వదేశానికి తిరిగి రానున్నాడని లంక చీఫ్ సెలక్టర్ అశాంత తెలిపారు.
నాలుగు జట్లు పాల్గొనే ఈ టోర్నీ ఏప్రిల్ 4 నుంచి 11 వరకు జరగనుంది.గాలే జట్టుకు మలింగ సారధ్య భాద్యతలు నిర్వహించనున్నారు.