తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పోస్టు సృష్టించిన ప్రకంపనలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి.
భంగపడ్డ ఎంపీ కోమటి రెడ్డి పార్టీపై రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయిందట.
టీపీసీసీ పదవి కోసం రేవంత్ రెడ్డితో పాటు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా చివరి వరకూ ప్రయత్నాలు చేశాడు.కానీ దురదృష్టవశాత్తు ఆ పదవి ఆయనను వరించలేదు.
దాంతో అలకబూనిన ఆయన ఢిల్లీ నుంచి రాగానే శంషాబాద్ విమానశ్రయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ పదవి డబ్బులకు అమ్ముడు పోయిందని అన్నారు.
పార్టీలో కష్టపడే వ్యక్తులకు ప్రధాన్యత లేదని ఆరోపించారు.తాజాగా ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ హై కమాండ్ వద్దకు చేరడంతో వారంతా కోమటి రెడ్డి వ్యవహార శైలిపై సీరియస్ గా ఉన్నారట.
తెలంగాణ రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి ఆరా తీశాడని తెలుస్తోంది. పైగా దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని త్వరలోనే బయట పెడతానని స్పష్టం చేశారు.
మరో పక్క కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ర్ట కాంగ్రెస్ నేతలు కూడా భగ్గుమంటున్నారు.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేశ్ గౌడ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఇన్నాళ్లు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అనుభవించిన పదవులన్నీ డబ్బులు పెట్టే కొనకున్నారా అని ప్రశ్నించారు.ఆయన పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించాడని దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ర్ట రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.మొత్తానికి టీపీసీసీ అధ్యక్ష పదవి కాంగ్రెస్ లో భారీగానే ప్రకంపనలు సృష్టిస్తోంది.