ఇది నిజంగా బుమ్రా అభిమానులకు షాక్ ఇచ్చే వార్త అనే చెప్పుకోవాలి.సరిగ్గా 24 రోజుల్లో T20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ ఆరంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే.ఈ T 20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.
బౌలింగ్ బ్యాక్ బోన్ జస్ప్రీత్ బూమ్రా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న సంగతి తెలిసినదే.దాంతో సౌతాఫ్రికా సిరీస్ తో పాటు T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కు సైతం దూరం అయ్యాడు.
ఇది క్రికెట్ అభిమానులు ఊహించని పరిణామం అని చెప్పుకోవాలి.
కాగా అతని స్థానంలో హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ కు అవకాశం దక్కనుందనే సమాచారం బయటకు పొక్కింది.
దాంతో బుమ్రా అభిమానులు మరింత బాధకు గురవుతున్నారు.T 20 కప్ పక్కకు పెడితే.
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టూర్ కు సిరాజ్ ను ఎంపిక చేసింది BCCI.ఇకపోతే గాయం వల్ల స్టార్ పెసర్ దూరం కావడం జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.
వరల్డ్ కోసం మరో పేస్ బౌలర్ మహమ్మద్ షమీ పేరును కూడా BCCI సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇకపోతే, బూమ్రా వెన్నెముక ఫ్రాక్చర్ బారిన పడినట్టు సమాచారం అందిన కొద్ది సమయానికే షమీ కోవిడ్ నుంచి కోలుకున్నాడు.సీనియర్ కావడం వల్ల సెలెక్టరులు షమీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉండవచ్చునని సమాచారం.అదే జరిగితే, సిరాజుకు T20 ప్రపంచ కప్ ఆడే ఛాన్స్ దక్కనట్టే అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా మరో 24 రోజుల్లో T20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ కోసం యావత్ క్రికెట్ అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు.