సురేష్ బాబు సమర్పణలో ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం లో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా.రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు‘(ఎవరు, ఎక్కడ, ఎందుకు).
ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాలో శివాని క్యూట్ లుక్ లో కనిపించబోతుంది.ఇప్పటికే విడుదలైన టీజర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని పాటలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి.
ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదలకానుంది.ఇంతకు ముందు శివాని నటించిన అద్బుతం సినిమా కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యి మంచి టాక్ను దక్కించుకున్న విషయం తెల్సిందే.‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` డిజిటల్ రైట్స్ని `సోనిలివ్` సంస్థ ఫ్యాన్సీ మొత్తానికి దక్కించుకుంది.అతి త్వరలో ఈ చిత్రం సోనిలివ్లో ప్రసారం కానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా.రవి ప్రసాద్ రాజు దాట్ల – మా ఫస్ట్ మూవీకి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది.ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ ఇది.ఓటీటీకి పర్ఫెక్ట్ ఛాయిస్.సోనివంటి ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ.
ఈ సినిమా సోనిలివ్ ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం.గుహన్గారి మేకింగ్, అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రి అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటుంది.` అన్నారు.
ఈమద్య కాలంలో సౌత్ లో ప్రాచుర్యం పొందేందుకు సోనీ లివ్ ఓటీటీ ప్రయత్నాలు చేస్తోంది.అందులో భాగంగానే వరుసగా సినిమాలను విడుదల చేస్తోంది.
ముందు ముందు సోనీ లివ్ నుండి పెద్ద సినిమాలు కూడా వస్తాయని ఆశిద్దాం.