మా మాజీ ప్రెసిడెంట్ శివాజీ రాజా అదృష్టం బాగుండి బతికి పోయాడు.గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా ఉంటున్న శివాజీ రాజా మరోసారి మీడియా ముందుకు వచ్చాడు.
శివాజీ రాజా స్నేహితుడు ఒక వ్యక్తి శ్రీలంక బాంబ్ బ్లాస్ట్లో మృతి చెందాడు, మరో స్నేహితుడు ఒక వ్యక్తి గాయాలతో బయట పడ్డాడు.వీరిద్దరితో పాటు శివాజీ రాజా కూడా శ్రీలంక టూర్కు వెళ్లాల్సి ఉంది.
కాని శ్రీలంక యాత్ర అనుకున్న తర్వాత ఒక కుటుంబ ఫంక్షన్ ప్లాన్ చేయడం జరిగింది.రెంటి డేట్లు క్లాష్ అవ్వడంతో లంక టూర్ను శివాజీ రాజా వదులుకున్నాడు.
ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం శివాజీ రాజా స్నేహితులు శ్రీలంక వెళ్లారు.అక్కడ ఈస్టర్ వేడుకల సందర్బంగా బాంబు బ్లాస్ట్లు జరగడంతో ఒక హోటల్లో బస చేస్తున్న వారు బాంబు దాటికి ఒకరు చనిపోగా, మరొకరు గాయాల పాలు అయ్యారు.
శివాజీ రాజా కూడా శ్రీలంక వెళ్లి ఉంటాడని చాలా మంది కూడా ఆయనకు ఫోన్ చేస్తున్నారట.తాను శ్రీలంక వెళ్లాల్సి ఉన్నా కూడా వెళ్లలేదు.నేను శ్రీలంక వెళ్లక పోవడంకు కారణం ఇంట్లో ఒక ఫంక్షన్ అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పుకొచ్చాడు.
నేను బాగానే ఉన్నాను, నా గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఒక మంచి మిత్రుడిని నేను కోల్పోయాను.ఆ దేవుడి దయ వల్ల నేను శ్రీలంక వెళ్లలేదు అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పాడు.
మా అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన శివాజీ రాజా మనసు మార్చుకుని మళ్లీ నటించాలని భావిస్తున్నాడు.అన్ని రకాల పాత్రలు చేస్తానంటూ ఆయన ముందుకు వస్తున్నాడు.