గత కొన్ని రోజులుగా టీవీ9 విషయం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.మొదట ఈ విషయంలో టీవీ9 మాజీ సీఈఓ మరియు శివాజీలపై కేసు నమోదు అయిన విషయం తెల్సిందే.
తాజాగా శివాజీపై కూడా కేసు నమోదు అవ్వడంపై మీడియా ముందుకు వచ్చాడు.మీడియాలో వస్తున్న వార్తలపై శివాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇదే సమయంలో హైదరాబాద్ పోలీసులు తమపై చేస్తున్న వ్యక్తిగత దాడి మరియు కక్ష సాధింపులకు ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న శివాజీ తాజాగా ఒక వీడియోను విడుదల చేశాడు.
ఆ వీడియోలో తాను ఎక్కడ దాచుకోలేదు అని, అనారోగ్య కారణంగా తాను ప్రస్తుతం కాస్త ఒంటరిగా ఉన్నాను.త్వరలోనే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తానంటూ ప్రకటించాడు.
వీడియోలో ఈ విషయంపై అతడు క్లారిటీ ఇచ్చాడు.రవి ప్రకాష్కు తనకు మద్య షేర్స్ విషయంలో విభేదాలు ఉన్న విషయం నిజమే అని, అయితే ఆ విషయంను క్రిమినల్ కేసుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నాడు.
పోలీసులు ఇష్టానుసారంగా ఇంట్లోకి ప్రవేశించి నా కుటుంబ సభ్యులను సోఫాల్లో కూర్చోబెట్టి వారు మాత్రం సోదాలు నిర్వహించడం, ఆ తర్వాత ఇంట్లో ఏమీ దొరకలేదు అంటూ వెళ్లి పోవడం జరిగింది.హైదరాబాద్లో తమకు బలం లేదని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారంటూ శివాజీ ఆరోపించాడు.
తాము సెటిలర్లం అవ్వడం వల్ల హైదరాబాద్ పోలీసులు మమ్ముల్ని వేదిస్తున్నారు అంటూ ఈ సందర్బంగా శివాజీ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు.