కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం భారత ప్రధాని గా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
సొంత బీజేపీ పార్టీ లో నేతలతో పాటు ఎన్డీయే లో భాగస్వామి అయిన పార్టీలకు కూడా మోడీ క్యాబినెట్ లో స్థానం దక్కనున్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో మోడీ కొత్త ప్రభుత్వం లో శివసేన నేత అరవింద్ సావంత్ కు చోటు దక్కినట్లు శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ధృవీకరించారు.
ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు స్థానం కల్పిస్తున్న నేపథ్యంలో శివసేన నుంచి మంత్రిగా ఒకరికి అవకాశం రావడంతో అరవింద్ సావంత్ పేరును ఉద్ధవ్ థాకరే ప్రతిపాదించారని, సావంత్ ఇవాళ ప్రమాణస్వీకారం చేస్తారని రౌత్ చెప్పారు.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ముంబై సౌత్ నియోజకవర్గం నుంచి 68 ఏళ్ల అరవింద్ సావంత్ ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ రోజు రాత్రి జరగబోయే మోడీ ప్రమాణ స్వీకారం తో పాటు దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.వారిలో సావంత్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
శివసేన డిప్యూటీ నేతగా ఉన్న అరవింద్ సావంత్, ఎంటీఎన్ఎల్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.