నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబోలో రాబోయే రెండో సినిమాగా ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
గతంలో ‘నిన్ను కోరి’ చిత్రంతో నానికి బ్లాక్బస్టర్ విజయాన్ని అందించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు మరోసారి అలాంటి విజయాన్ని అందించేందుకు రెడీ అయ్యాడు.అయితే టక్ జగదీష్ చిత్రం నేరుగా థియేటర్లలో కాకుండా ఓటీటలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఇక ఈ సినిమాతో దర్శకుడు శివ నిర్వాణ మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని తాజాగా అనౌన్స్ చేశాడు ఈ డైరెక్టర్.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు శివ నిర్వాణ తెలిపాడు.ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్గా ప్రారంభించనున్నట్లు శివ నిర్వాణ తెలిపాడు.
విజయ్ దేవరకొండతో తాను చేయబోయే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందని శివ నిర్వాణ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
మొత్తానికి టక్ జగదీష్ చిత్రం తరువాత శివ నిర్వాణ తన నెక్ట్స్ మూవీని రెడీ చేసేందుకు అప్పుడే సిద్ధమయ్యాడని చెప్పాలి.
టక్ జగదీష్ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్న దర్శకుడు శివ నిర్వాణ, తన నెక్ట్స్ మూవీపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యేలా చేస్తున్నాడు.కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటి్తోంది.మరి శివ నిర్వాణ డైరెక్షన్లో రాబోయే చిత్రంలో విజయ్ దేవరకొండ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో తెలియాలంటే ఈ సినిమా పట్టాలెక్కే వరకు వెయిట్ చేయాల్సిందే.