టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసం విజయ్ కూడా చాలా కష్ట పడ్డాడు.
ఈ సినిమా ఇప్పటికి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.లైగర్ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.ఈ సినిమా తర్వాత మరోసారి పూరీ జగన్నాథ్, విజయ్ కాంబోలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను మళ్ళీ విజయ్ తోనే తీయాలని ఫిక్స్ అయ్యాడు.
ఈ సినిమా కూడా త్వరగానే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక జనగణమన సినిమాను కూడా పూరీ తన బ్యానర్ మీద నిర్మిస్తున్నాడని సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా కంటే ముందే విజయ్ దేవరకొండ శివ నిర్వాణం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు విజయ్ జనగణమన సినిమాతో పాటు శివ నిర్వాణ సినిమాను కూడా ఒకే సమయంలో పూర్తి చేయబోతున్నాడట.శివ నిర్వాణ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఈ సినిమాపై రూమర్స్ మాత్రం రోజుకొకటి వస్తూనే ఉన్నాయి.నిన్నటి వరకు ఈ సినిమాలో విజయ్ తో సమంత రొమాన్స్ చేయనుందని వార్తలు జోరుగా వచ్చాయి.
ఇంకా ఈ విషయంపై ఒక క్లారిటీ రాకుండానే ఇప్పుడు మరొక వార్త వైరల్ అయ్యింది.తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ సినిమాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ను తీసుకోవాలని శివ నిర్వాణ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియదు.కానీ ఈ వార్త మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది.చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికి అఫిషియల్ గా ప్రకటిస్తారో.