నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జాతి రత్నాలు.ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అలాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు అనుదీప్.ప్రస్తుతం తమిళ హీరో శివ కార్తికేయన్ తో కలిసి ప్రిన్స్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
ఈ నెలలోనే విడుదల కాబోతున్న ప్రిన్స్ సినిమా యొక్క ట్రైలర్ తాజాగా విడుదలైంది.అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన సినిమా అవడంతో కచ్చితంగా జాతి రత్నాలు సినిమా స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అంతా భావించారు.
కానీ అనూహ్యంగా సినిమా యొక్క ఎంటర్టైన్మెంట్ జాతి రత్నాలతో పోలిస్తే తక్కువే ఉంటుందని అనిపిస్తుంది. ప్రిన్స్ మరియు జాతి రత్నాలు రెండు విభిన్నమైన సినిమాలు, రెండింటిని పోల్చవద్దు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
దర్శకుడు అనుదీప్ విభిన్నమైన కథతో శివ కార్తికేయన్ అభిమానులు సంతృప్తి చెందే విధంగా ప్రిన్స్ సినిమా ను తెరకెక్కించాడంటూ వార్తలు వస్తున్నాయి.
తాజాగా విడుదలైన ట్రైలర్ తో శివ కార్తికేయన్ అభిమానులు సంతృప్తి చెందుతున్నారు, కానీ జాతి రత్నాలు సినిమా స్థాయిలో ఊహించుకున్న వారు కొందరు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.శివ కార్తికేయన్ ని ఈ సినిమాలో ఒక స్కూల్ టీచర్ గా చూపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.అంతే కాకుండా ఈ సినిమాలో ఒక ఇంగ్లీష్ హీరోయిన్ నటించడంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన ప్రిన్స్ సినిమా ఈ నెల లో విడుదల కాబోతుంది.ఈ సినిమా సక్సెస్ అయితే దర్శకుడు అనుదీప్ కచ్చితంగా తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీలో మరింత బిజీగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
శివ కార్తికేయన్ తమిళంలో వరుసగా సక్సెస్ లను దక్కించుకుంటూ దూసుకు పోతున్న ఈ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ప్రిన్స్ తో ఎంత మేరకు ఆయన ఆకట్టుకుంటాడు, తెలుగులో ఏ స్థాయిలో బిజినెస్ చేసి కలెక్షన్స్ ని రాబడతాడు అనేది చూడాలి.