గత కొన్ని రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల రచ్చ తీవ్ర స్థాయిలో ఉండేది.అక్టోబర్ 10వ తేదీ ఈ ఎన్నికలు జరగగా ప్రకాష్ రాజ్ ప్యానల్ పై మంచు విష్ణు అత్యధిక మెజారిటీతో గెలిచారు.
ఇలా మంచు విష్ణు ప్యానల్ లో పోటీ చేసిన నటుడు శివ బాలాజీ మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుడైన నాగినీడు పై అత్యధిక మెజారిటీతో గెలిచి ట్రెజరర్ బాధ్యతలను చేపట్టారు.అయితే మా ఎన్నికల సమయంలో నటుడు శివ బాలాజీను నటి హేమ కొరకడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఈ క్రమంలోనే హేమ శివబాలాజీని కొరకడంతో అతని చేతి పై గాయం కావడం చేత అతను వెంటనే వెళ్లి ఇన్ఫెక్షన్ కాకుండా వైద్యం చేయించుకున్నట్లు మీడియా సమావేశంలో తెలియజేశారు.
ఇదిలా ఉండగా తాజాగా శివబాలాజీ భార్య మధుమిత నటి హేమ తన భర్తను కొరకడం పై స్పందించారు.
ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ చెయ్యి కొరకడం వంటి పనులను మనుషులు మాత్రం చెయ్యరు.ఈ విషయం గురించి ఇంతకన్నా ఇంకేం మాట్లాడలేను అంటూ మధుమిత హేమ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
అలాగే నిస్వార్ధంగా సేవ చేసే వారికి గెలుపు ఖాయం అవుతుందని ఈ ఎన్నికలు నిరూపించాయి అంటూ ఆమె తన భర్త గెలుపు గురించి మాట్లాడారు.
శివ బాలాజీ చెయ్యి కొరకడం పై స్పందించిన హేమ తనదైన శైలిలో మాట్లాడారు.పోలింగ్ కేంద్రం వద్ద తాను వెళ్తున్న సమయంలో శివబాలాజీ తనని వెళ్లనివ్వకుండా చేయి అడ్డుగా పెట్టాడని, అప్పటికే తాను తప్పుకొమ్మని చెప్పినప్పటికీ అతను చెయ్యి తీయకపోవడంతో కోరికానని ఆమె సమాధానం చెప్పారు.ఏదిఏమైనప్పటికీ ఎన్నికల కేంద్రం వద్ద హేమా శివబాలాజీని కొరకడం చర్చనీయాంశంగా మారింది.