పాకిస్తాన్ మీద ద్వేషంతో శివసేన సంగీత విద్వాంసులను అవమానిస్తున్నది.పాకిస్తాన్కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు గులాం అలీని శివ సేన వెంటాడుతున్నది.
ఈమధ్య ముంబైలో గులాం కార్యక్రమం ఏర్పాటు చేయగా శివసేన పట్టుదల, నిరసన కారణంగా నిర్వాహకులు గులాం అలీ కార్యక్రమం రద్దు చేశారు.పాకిస్తాన్ సరిహద్దుల్లో బారత సైనికులను కిరాతకంగా చంపుతున్నదని, ఇందుకు నిరసనగా ఆ దేశానికి చెందిన గజల్ గాయకుడు గులాం అలీ కార్యక్రమం రద్దు చేయాలని పట్టు పట్టుబట్టామని శివసేన చెబుతోంది.
గులాం అలీ కార్యక్రమానికి భద్రత కల్పిస్తామని మొదట భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫద్నవీస్ శివసేన నిరసనకు తలవంచారు.గులాం అలీ కార్యక్రమం ముంబైలో రద్దు కాగానే ధిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రకటన చేశారు.
గులాం అలీ కార్యక్రమం దిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు.దీంతో శివసేన మండి పడుతున్నది.
దిల్లీలో కూడా గులాం అలీ కార్యక్రమం సాగనివ్వబోమని శివసేన ప్రకటించింది.పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహమ్మద్ కసూరి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని భాజపాకు చెందిన సుధీంద్ర కుల్కర్నీ ఏర్పాటు చేయగా ఆయన మీద సిరా (ఇంకు) పోసి దారుణంగా అవమానించింది శివసేన.
ఇది భాజపాకు మిత్ర పక్షమైనా దాన్ని లేకా చేయడం లేదు.ధిల్లీ సీఎమ్ అరవింద్ కేజ్రీవాల్ శివసేనతో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.