శివసేన కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ అయింది.ఈ మేరకు స్పీకర్ నిర్ణయంపై విస్తృత ధర్మాసనం విచారణ చేయనుంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు డిప్యూటీ స్పీకర్ నోటీసులను షిండే వర్గం సుప్రీంలో సవాల్ చేసింది.
ఈ క్రమంలో రెండు పిటిషన్లపై సుమారు తొమ్మిది రోజులపాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మార్చి 16వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది.