మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రతాపం తీవ్రంగా ఉండటంతో షిరిడీ వెళ్లే సాయిబాబా భక్తుల కోసం షిరిడీ సంస్దాన్ వారు కీలక ప్రకటన చేశారు.బాబా దర్శనం వేళల్లో కూడా మార్పులు చేపట్టారు.
ఆ వివరాలు చూస్తే.ఇకపై ఉదయం 7.15 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు భక్తుల సందర్శనార్ధం ఆలయం తెరిచి ఉంటుందని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.కాగా ఇదివరకు సాయిబాబా ఆలయం ప్రతీ రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచేవారు.కానీ ఆసమయాన్ని కుదించారు.అలాగే ఉచిత ఆహారం అందించే శ్రీ సాయి ప్రసాదాలయం ఇకనుండి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు తెరిచి ఉంటుందని స్పష్టం చేశారు.
అంతే కాకుండా ప్రతీ రోజూ తెల్లవారు జామున 4.30 గంటలకు కాకాడ్ ఆరతీ, అలాగే రాత్రి 10.30 గంటలకు చివరి ఆరతీ యధావిధిగా జరుగుతాయని.కానీ ఈ సమయాల్లో ఆలయ ప్రాంగణంలోకి భక్తులను అనుమతించేది లేదని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటనను జారీ చేసింది.
ఇకపోతే ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.