బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా దాదాపు పూర్తి అయ్యిందని కొంచెం ప్యాచ్ వర్క్ మాత్రమే ఉందని చిత్ర యూనిట్ ఎప్పటి నుండో చెబుతున్న మాట.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాను యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.ఎప్పుడో రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా జులై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
కానీ మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యింది.దీని కారణంగా మళ్ళీ వాయిదా పడింది.
అయితే ఈ సినిమాలోని కొన్ని విషయాలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ పూజ హెగ్డే మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది.రాధేశ్యామ్ సినిమాలో వచ్చే షిప్ సీన్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఇంట్రెస్ట్ గా మాట్లాడు కుంటున్నారు.ఈ సినిమాలో వచ్చే షిప్ సీన్స్ టైటానిక్ రేంజ్ లో అద్భుతంగా వచ్చాయని చెబుతున్నారు.
ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా ఉంటాయట.ఈ సీన్లు ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తాయి.చూడాలి మరి ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తాయో.ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఈ సినిమాతో పాటుగా సలార్, ఆది పురుష్ సినిమాలు కూడా అనౌన్స్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.
ఈ రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ పూర్తి చేస్తూ ప్రభాస్ బిజీగా ఉన్నాడు.