సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో మెగా మేనళ్లుడు బాగా బై హర్ట్ చేసినట్టున్నాడు.తన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ ఉండేలా చేసుకుంటున్న సాయి ధరం తేజ్ తిక్కలో మెగాస్టార్ పాటను రీమిక్స్ చేయలేదు కదా అనుకున్నారు.
కాని అంతకంటే ఎక్కువ క్రేజ్ వచ్చేలా ఏకంగా ఇద్దరు తమిళ సూపర్ హీరోలతో సినిమాలో పాటలు పాడిస్తున్నాడు.ఇక ఈ విషయంలో తేజుకి థమన్ ఫుల్ సపోర్ట్ వచ్చింది.
ఇంకేముందు ఇద్దరు కలిసి కుమ్మేస్తున్నారు.సునీల్ రెడ్డి డైరక్షన్లో సాయి ధరం తేజ్ హీరోగా చేస్తున్న తిక్కలో ఇప్పటికే ధనుష్ ఓ పాట పాడిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అదే తిక్క సినిమాలో మరో క్యాచీ నెంబర్ శింబు చేత పాడిస్తున్నాడట థమన్.మరి తేజు తిక్కలో ధనుష్, శింబుల ప్రమేయం చూస్తుంటే తేజు ఐడియా అదర్స్ అనేలా ఉంది.
ఇక రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా సినిమా మరో హిట్ తలపిస్తుంటే క్రేజ్ ఎక్కడ తగ్గకుండా కావాల్సిన ప్రీ రిలీజ్ బజ్ ఏర్పాటు చేస్తున్నారు చిత్రయూనిట్.రీసెంట్ గా సుప్రీంతో తన సత్తా చాటిన తేజు ఈ తిక్కతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.
మన్నారా చోప్రా, లారిసా హీరోయిన్ స్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల చివరన ఆడియో, సినిమా ఆగష్టు రెండో వారంలో రిలీజ్ అవుతుంది.