సినీ పరిశ్రమలు హీరో హీరోయిన్లుగా ఎదగాలి అంటే వారు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది.ఈ క్రమంలో ప్రేక్షకులను మెప్పించేయందుకు చాలా మంది హీరో హీరోయిన్లు అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పలు రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.
ఇక కొంతమంది హీరో, హీరోయిన్లు సింగిల్ టేక్ లోనే సీన్స్ ను పూర్తి చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి.అయితే తాజాగా సినీ నటుడు శింబు కూడా సింగిల్ టేక్ లోనే 6 నిమిషాల సీన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
శింబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ మనాడు‘ .ఈ సినిమా వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించిన సంగతి అందరికి విదితమే ఈ సినిమాలో శింబు సరసన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చెన్నైలో చిత్రీకరణ జరుగుతోంది.
ఈ క్రమంలో 6 నిమిషాల సీన్ హీరో శింబు సింగిల్ టేక్ లో పూర్తి చేసి సింగిల్ టేక్ నటుడిగా మరోసారి తన సత్తా చాటుకున్నాడు.ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా 6 నిమిషాల సీన్ పూర్తవగానే చిత్ర యూనిట్ మొత్తం ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సినిమాలో ప్రధాన పాత్రలు ఎస్.జె.సూర్య నటిస్తుండగా, వైజీ.మహేంద్రన్, వాగై చంద్రశేఖర్, ఎస్ఏ చంద్రశేఖర్, ఆంజనా కీర్తి, ఉదయ, మనోజ్ కె భారతి, కరుణాకరణ్, మహత్, డేనియల్ పోప్ తదితరులు ముఖ్య పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.