సౌత్ ఇండియాలో హీరోయిన్స్ తో ఎక్కువ ప్రేమ కథలు నడిపిన హీరో ఎవరంటే ముందుగా అందరూ శింబు పేరు టక్కున చెబుతారు.హీరోయిన్స్ తో ప్రేమాయణం సాగించడంలో శింబు చాలా ముందు వరుసలో ఉంటాడని టాక్ ఉంది.
నయనతారతో పదేళ్ళ క్రితం ప్రేమాయణం సాగించి పెళ్లి వరకు తీసుకొచ్చి తరువాత బ్రేక్ అప్ చెప్పేసాడు.అయితే తరువాత కాలంలో ఇద్దరు కలిసి ఒక సినిమా కూడా చేశారు.
ఈ సినిమా కథ కూడా ఇంచు మించు వీరి లైఫ్ కి దగ్గరగా ఉంటుంది.తరువాత శింబు హీరోయిన్ హాన్సికతో కొంతకాలం ప్రేమాయణం నడిపాడు.
ఆమెని కూడా పెళ్లి పీటలు వరకు తీసుకొని వెళ్ళాడు.పెళ్లి చేసుకుంటారు అనే సమయంలో మళ్ళీ విడిపోయారు.
ఎవరి జీవితాలలో వారు ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు శింబు, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారు అనే టాక్ కోలీవుడ్ లో ప్రచారంలో ఉంది.
త్వరలో వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారని, దానికి సంబంధించి వారి తల్లిదండ్రులు కూడా ముహూర్తాలు చూస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది.వీరిద్దరు కలిసి గతంలో ఏమాయ చేసావే తమిళ మాతృకలో కలిసి నటించారు.
ఇప్పుడు గౌతమ్ మీనన్ మరోసారి ఈ సినిమా సీక్వెల్ కి రంగం సిద్ధం చేస్తున్నారు.ఈ నేపధ్యంలో శింబు, త్రిష పెళ్ళికి సంబందించిన వార్త ప్రచారంలోకి వచ్చింది.
అయితే దీనిపై ఇప్పటి వరకు వీరిద్దరిలో ఎవరూ కూడా స్పందించి ఖండించే ప్రయత్నం చేయలేదు.దీంతో ఇది నిజమనే అందరూ భావిస్తున్నారు.