బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి పారిశ్రామిక వేత్త అయినా రాజ్ కుంద్రా ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.బాలీవుడ్ లో అన్యోన్యంగా ఉండే కపుల్స్ లో శిల్పా శెట్టి కపుల్ కూడా ఉన్నారు.
అయితే గత కొన్ని రోజుల క్రితం రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణల కేసులో అరెస్ట్ అయినా విషయం తెలిసిందే.అయితే అప్పటి నుండి ఈ జంట చాలా సమస్యలను ఎదుర్కొంటుంది.
రాజ్ కుంద్రా వ్యవహారంలో శిల్పా శెట్టి కలత చెందడంతో విడాకుల వరకు వీళ్ళ వ్యవహారం వెళ్లిందని చాలా రోజుల నుండి ప్రచారం జరుగుతుంది.అయితే ఈ రూమర్స్ అన్నిటికి శిల్పా శెట్టి ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టేసింది.
ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా తన భర్త కోసం శిల్పా శెట్టి ఓకే స్పెషల్ పోస్ట్ చేసింది.ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా వివాహం జరిగి 12 సంవత్సరాలు అయ్యింది.ఈ రోజు వీరి పెళ్లి రోజు.
దీంతో తమ జంటపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాలని భావించిందో ఏమో కానీ శిల్ప శెట్టి తమ పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ చేయడంతో అందరి నోళ్లకు మూత పడినట్టు అయ్యింది.ఆమె పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.
సరిగ్గా 12 సంవత్సరాల క్రితం మేము మంచి, చెడు సమయాల్లో కలిసే ఉంటామని ఒకరికొకరం వాగ్దానం చేసుకున్నాం.ఈ రోజు కూడా ఈ హామీని నెరవేరుస్తున్నాం.మేము ప్రేమను నమ్ముతాం.దేవుడు ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని చూపిస్తాడు.హ్యాపీ యానివర్సరీ కుక్కీ.అంటూ శిల్పా శెట్టి పెళ్ళినాటి ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫొటోల్లో ఈ జంట ఖరీదైన దుస్తులతో అందంగా కనిపిస్తున్నారు.ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.