బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గత కొద్దిరోజుల క్రితం పోర్నోగ్రఫీ కేసు ద్వారా జైలు పాలయిన సంగతి మనకు తెలిసిందే.రాజ్ కుంద్రా అశ్లీల వీడియోలను తీస్తూ వాటిని హాట్ షాట్స్, బాలీ ఫేమ్ వంటి యాప్స్ లో అప్లోడ్ చేస్తూ లక్షల్లో డబ్బుసంపాదిస్తున్నారని ఆరోపణలు రావడంతో ముంబై పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకుని ఈ విషయంపై విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నటువంటి రాజ్ కుంద్రా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కోర్టు మాత్రం అతని బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
ఈ కేసు విషయంపై తాజాగా ముంబై పోలీసులు రాజ్ కుంద్రా పై 1500 పేజీల చార్జ్ షీట్ ను దాఖలు చేశారు.
ఈ చార్జ్ షీట్ లో భాగంగా రాజ్ కుంద్రా భార్య నటి శిల్పా శెట్టి పేరును చార్జ్ షీట్ లో సాక్ష్యంగా పెట్టారు.ఇలా శిల్పా శెట్టి పేరును చార్జ్ షీట్ లో సాక్ష్యంగా పెట్టడంతో ఈ విషయంపై నటి స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు… ఈ సందర్భంగా శిల్పాశెట్టి మాట్లాడుతూ.
తాను పలు షూటింగులతో బిజీగా ఉండటం వల్ల తన భర్త ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేసేవాడో తనకు తెలియదని, తన భర్త చేసే పనుల గురించి తాను ఎప్పుడు పట్టించుకోలేదంటూ శిల్పా శెట్టి ఎంతో షాకింగ్ విషయాలు తెలియజేశారు.
అదేవిధంగా హాట్ షాట్స్, బాలీ ఫేమ్ వంటి యాప్స్ గురించి తనకు తెలియదని, తన భర్త గురించి తనని అడగకండి తానెప్పుడు రాజ్ కుంద్రా ఏ పని చేస్తున్నాడనే విషయాల గురించి ఆరా తీయలేదని శిల్పాశెట్టి స్టేట్మెంట్ ఇవ్వడంతో, ముంబై పోలీసులు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ను ముంబై పోలీసులు చార్జ్ షీట్ లో పొందుపరిచారు.ఇక పోర్నోగ్రఫీ కేసు ద్వారా జైలుపాలైన రాజ్ కుంద్రా బెయిల్ ద్వారా బయటకు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే కోర్టు మాత్రం ఇతనికి బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ అతని పిటిషన్ కొట్టివేసింది.
ఇకపోతే రాజ్ కుంద్రా ఇలాంటి వీడియోలు తీస్తూ జైలుకు వెళ్లడంతో ఇకపై శిల్పాశెట్టి తన నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నారని ఈ క్రమంలోనే విడాకులు తీసుకొని తన భర్తకు దూరం కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే ఈ విషయంపై శిల్పాశెట్టి స్పందించక పోవడం గమనార్హం.