నాగ్ హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్బాస్ సీజన్ 3 చాలా నీరసంగా సాగుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.టాస్క్లు ఎలిమినేషన్కు నామినేషన్ పక్రియా ఇలా అన్ని కూడా ప్రేక్షకులకు విసుగు, నీరసం తెప్పించే విధంగా సాగుతున్నాయంటూ టాక్ వస్తుంది.
సోషల్ మీడియాలో ఈ సీజన్పై టాక్ ఏ స్థాయిలో వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక ఈ సీజన్ మొత్తం కూడా ఎలిమినేషన్ అయ్యే వారి పేర్లు ముందుగానే తెలిసి పోతున్నాయి.
ఇక ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరు అనే విషయంపై కూడా అప్పుడే చర్చ మొదలైంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం ఎలిమినేషన్కు నామినేట్ అయిన శ్రీముఖి, హిమజ, పునర్నవి, మహేష్ ఇంకా శిల్ప.ఈ అయిదుగురులో శిల్ప చక్రవర్తికి తక్కువ ఓట్లు పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఆన్లైన్లో పలువురు ఓటింగ్ నిర్వహించినా కూడా శిల్పకు తక్కువ ఓట్లు పడుతున్నాయి.
ఈజీగా శ్రీముఖి సేవ్ అవుతుందని, ఇక పునర్నవి మరియు హిమజలు కూడా మంచి ఫాలోయింగ్ను దక్కించుకున్న కారణంగా వారికి ఓట్లు పడుతాయి.ఇక సోషల్ మీడియాలో స్టార్గా గుర్తింపు ఉన్న మహేష్ కూడా మంచి ఓట్లను దక్కించుకున్నాడు.
కాని రెండు వారాల క్రితమే రావడంతో పాటు మొన్న వీకెండ్ క్యాక్రమంలో నాగార్జున మరియు ఇంటి సభ్యులతో ఈమె మాట్లాడిన మాటలు కాస్త ఇబ్బందిగా అనిపించాయి.అందుకే ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేసేందుకు ఆసక్తిగా లేరు అంటూ టాక్ వినిపిస్తుంది.ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం శిల్పకు ఓట్ల సంఖ్య చాలా తగ్గింది.కనుక ఆమె ఎలిమినేషన్ కన్ఫర్మ్.వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రీ కూడా రెండవ వారంలోనే ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే.అలాగే శిల్ప పరిస్థితి కూడా.
సోషల్ మీడియా ద్వారా రేపు మద్యాహ్నంకు ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయంపై క్లారిటీ రానుంది.