శిఖర్ ధావన్ ఈ పేరు తెలియని ఇండియన్ క్రికెట్ క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు.అంతలా ధావన్ తన ఆటతో అందరి మనసులనూ దోచుకున్నాడు.
కానీ ఇటీవల ఫామ్ లేమితో అతను అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.వ్యక్తిగతంగా కూడా ధావన్ కొన్నిసమస్యలను ఫేస్ చేశాడు.
అయినా కానీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతానని ధావన్ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.ఈ మధ్య భారత జట్టులోకి అనేక మంది కుర్రాళ్లు ఎంట్రీ ఇవ్వడంతో ధావన్ కు టెస్టు జట్టులో చోటు లేకుండా పోయింది.
ఇప్పుడంటే ధావన్ కు చోటు లేదు కానీ ధావన్ ఆడిన ఇన్సింగ్స్ లు మాత్రం ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేనివి.అలా ధావన్ తన బ్యాటుతో అనేక కీలక ఇన్సింగ్సులు ఆడాడు.
ధావన్ క్రికెట్ తో పాటు సోషల్ మీడియాలో నూ చాలా యాక్టివ్ గా ఉంటాడు.ధావన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫన్నీ వీడియోను సుమారుగా లక్షన్నర మంది నెటిజన్లు వీక్షించారు.
టెస్టుల్లో అంటే ఏమో కానీ ప్రస్తుతం త్వరలో జరగనున్న సౌతాఫ్రికా సిరీస్ కు ధావన్ వన్డేల్లో అందుబాటులో ఉండే అవకాశాలు కొట్టి పారేయలేం.ఎందుకంటే బీసీసీఐ ఇంకా వన్డే జట్టును ప్రకటించలేదు.దాంతో ధావన్ కు చాన్స్ దొరికే అవకాశాన్ని మనం కొట్టి పారేయలేం.అయితే ధావన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారింది.ఈ వైరల్ వీడియోలో శిఖర్ ధావన్ అమితాబ్ నటించిన షోలే సినిమాలోని డైలాగ్ తో ఆకట్టుకున్నాడు.ఈ వీడియో ప్రస్తుతం హల్చల్ అవుతుంది.
ధావన్ చివరిసారిగి శ్రీలంక సిరీస్ లో ఇండియా ఏ జట్టుకు కెప్టెన్సీ చేశాడు.ఆ సిరీస్ లో ధావన్ అర్ధ సెంచరీతో మెరిశాడు.
మరలా అతడు సౌతాఫ్రికా సిరీస్ లో ఆడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.