టీమ్ ఇండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్..?!

అతి త్వరలో మొదలు కాబోతున్న శ్రీలంక, టీమ్ ఇండియా పర్యటనలో భాగంగా తాజాగా మ్యాచ్ ల షెడ్యూల్ ఖరారైంది.ఈ సిరీస్ నేపథ్యంలో భాగంగా ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, మూడు టి-20 లు ఆడేందుకు టీమిండియా యువ బృందం శ్రీలంకకు పయనం కాబోతోంది.

 Shikhar Dhawan To Captain Team India Team India , Captain, Shikar Dawan, Sports,-TeluguStop.com

ఇకపోతే ఈ యువ బృందానికి శిఖర్ ధావన్ నేతృత్వం వహించబోతున్నారు.అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా సోనీ స్పోర్ట్స్ మాత్రం వారు ప్రసారం చేయబోయే పర్యటన మ్యాచ్ లకు సంబంధించి అధికారికంగా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.

ఇందులో భాగంగా టీమిండియా శ్రీలంకలో జూలై 13, 16, 18 తేదీలలో మూడు వన్డేలు ఉండగ ఆ తర్వాత జూలై 21, 23, 25 తేదీలలో మూడు టి-20 లు ఆడనుంది.

Telugu July, Day Matches, Shikar Dawan, India-Latest News - Telugu

ఇకపోతే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ తోపాటు ఆగస్టు నెలలో ఇంగ్లండ్ జట్టుతో జరగబోయే ఐదు టెస్టుల సీరీస్ కొరకు ఇప్పటికే రవిశాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్న కోహ్లీసేన ఇంగ్లాండ్ లో అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఇదే క్రమంలోనే జూలై నెలలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేపథ్యంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో టీమిండియా బృందం శ్రీలంక పయనం కాబోతోంది.

Telugu July, Day Matches, Shikar Dawan, India-Latest News - Telugu

శ్రీలంక కు వెళ్లే జట్టులో శిఖర్ ధావన్ తో పాటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, చాహల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, దీపక్ చాహర్, ఇషాంత్ కిషన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ షైనీ, భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్లు వెళ్లే అవకాశం లేకపోలేదు.అయితే పూర్తి వివరాలు బిసిసిఐ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube