ఆ గొర్రెల కాపరి పంట పండింది.ఎవరికో గాని వజ్రాలు దొరకవు.
అలాంటిది కర్నూల్ జిల్లాలోని మరో వజ్రం లభ్యమైంది.ఇంకా ఆ వజ్రాన్ని స్థానికి వ్యాపారి రూ.3.60లక్షలకు విక్రయించాడు.అయితే ఈ వజ్రం విలువ ఎక్కువ అని సమాచారం.గొర్రెల కాపరిని మోసం చేసి వజ్రాల వ్యాపారి తక్కువ ధరకే దాన్ని కొన్నట్టు స్థానికులు అనుకుంటున్నారు.
అయితే కర్నూల్ ప్రాంతంలో ఈ సీజన్ లో వజ్రాలు దొరకడం చాలా కామన్ అని స్థానికులు చెబుతున్నారు.ఈ ప్రాంతంలో ఇప్పటికే ఎంతోమందికి విలువైన వజ్రాలు దొరికినట్టు వార్తలు వస్తున్నాయ్.
అయితే ఈ ప్రాంతంలో తొలకరి వర్షాలు పడితే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని కొన్ని గ్రామాల్లో సందడి వాతావరణం ఏర్పడుతుంది.
ఇంకా ఈ ప్రాంతాలకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వజ్రాల వేటకు వస్తారు.
ఇక్కడికి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.మహిళలు చంటి బిడ్డలతో వచ్చి మరీ వజ్రాల కోసం వెతుకుతుంటారు.
ఎన్నో ఏళ్లగా ఈ వజ్రాల వేట కొనసాగుతున్నట్టు సమాచారం.గత నెల రోజుల వ్యవధిలోనే సుమారు 6 వజ్రాలు దొరికాయని సమాచారం
.