టాలీవుడ్ లో మంచి దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా మంచి పేరొందిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల.ప్రతి ఒక్క సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నింటికీ పురస్కారాలు కూడా అందుకున్నాడు.ఈయన సినిమాలన్నీ మంచి కథతో మొదలవుతూ.
చివరి వరకు అంతే ఆనందాన్ని ఇస్తుంది.ఇక ఈయన 2017 లో ఫిదా సినిమా ప్రేక్షకులను ఫిదా చేసిన సంగతి తెలిసిందే.
ఫిదా సినిమా మంచి విజయాన్ని అందించిన తర్వాత శేఖర్ కమ్ముల మరో సినిమాను తెరకెక్కించనున్నాడు.అక్కినేని నాగచైతన్య హీరోగా వస్తున్న లవ్ స్టోరీ సినిమా.ఈ సినిమాలో ఫిదా ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా నాగచైతన్యకు, సాయి పల్లవి కు మంచి విజయాన్ని అందిస్తున్న విషయాలు వినిపిస్తున్నాయి.
చాలావరకు శేఖర్ కమ్ముల సినిమాలు ఒక ఎమోషనల్ ను తెస్తాయి.
ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్ ద్వారా చూసినట్లయితే ఆరు కోట్ల వరకు వచ్చాయని, ఇక సంగీతం ద్వారా 50 లక్షలు వచ్చాయని తేలగా.నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా 20.50 కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చాయని తెలుస్తుంది.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందిస్తుందని అర్థమవుతుంది.ఈ సినిమా గురించి కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి. ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ పరంగా ఎటువంటి ఫీలింగ్స్ ను అందిస్తాయో తెలియదు కానీ.మొత్తానికి ఈ సినిమా నుంచి బడ్జెట్ వస్తుందని అంచనాలు వేయవచ్చు.
ఈ సినిమాకు మొదటి సారి నాన్ థియేట్రికల్ గా పెట్టిన పెట్టుబడి లో సగానికంటే ఎక్కువ వసూలు అయినట్లు తెలుస్తుంది.ఈ మార్గంలో లో అన్ని ఒప్పందాలు కూడా జరుగగా.
సినిమా శాటిలైట్ ధర 8 కోట్లకు అమ్మారని తేలింది.అంతేకాకుండా ఆహా యాప్ ఆరు కోట్ల వరకు ధర పలికిందని వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికొస్తే విడుదల వరకు ఆగాల్సిందే.ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 16న ఈ సినిమా విడుదల కానుంది.