కంప్యూటర్ యుగంలో కూడా చేతబడి, బానామతి అంటూ కొందరు చేస్తున్న పనులు ఆశ్చర్యంను కలిగించక మానవు.చేతబడి అనేది మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంది చేస్తారు.
చేతబడులను నమ్మి కొందరు ప్రాణాలు తీయడం, మరి కొందరు తమను తాము చంపుకోవడం చేస్తూ ఉంటారు.అయితే దీని వల్ల లాభ పడ్డ వారు మాత్రం పెద్దగా కనిపించరు.
అయినా కూడా ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటూ మూడ నమ్మకాలను గుడ్డిగా నమ్మేస్తున్నారు.
తాజాగా బ్రెజిల్కు చెందిన 18 ఏళ్ల కరీనా అనే అమ్మాయి మూడ నమ్మకాలతో, ఒక పుస్తకంలో చదివి క్షుద్ర పూజలు నిర్వహించింది.
అందుకోసం తన సొంత తమ్ముడు అయిన అయిదు సంవత్సరాల కుర్రాడిని చంపేసింది.చంపేయడమే కాకుండా ఆ కుర్రాడిని ముక్కలు ముక్కలుగా నరికి క్యాండిల్స్ కింద పెట్టింది.అతడి పురుషాంగంను కోసి తినడం కూడా జరిగింది.ఇంతటి దారుణంకు పాల్పడ్డ ఆమె తనకు అద్బుత శక్తులు వస్తాయని ఇలా చేసినట్లుగా తెలుస్తోంది.
చుట్టు క్యాండిల్స్ వెలిగించి మద్యలో కూర్చుని తమ్ముడి శరీర భాగాలను తింటున్న కరీనా బయట నుండి తలుపు కొట్టినా తీయక పోవడంతో ఆమె తల్లి స్థానికుల సాయంతో వెనుక తలుపులు బద్దలు కొట్టించింది.తలుపు తెరిచి చూడగానే అంతా కూడా అవాక్కయ్యారు.రక్తపు మడుగులో కూర్చున్న ఆమె ఏదో మంత్రాలు చదువుతూ దగ్గరకు రాకుండా వస్తువులు విసురుతూ వచ్చింది.దాంతో ఇద్దరి ముగ్గురికి గాయాలు కూడా అయ్యాయి.దాంతో ఆమె అక్కడ నుండి పారిపోయేందుకు ప్రయత్నించింది.పోలీసులు ఆమెను పట్టుకుని విచారించగా ఆ అబ్బాయి పురుషాంగం మాత్రమే కాకుండా ఇంకా పలు శరీర భాగాలను కూడా తిన్నట్లుగా చెప్పుకొచ్చింది.
పోలీసులు కూడా ఆమె చెబుతుంటే భయంతో వణికి పోయారు.ఇలా ఎందుకు చేశావు అంటే మాత్రం సమాధానం చెప్పలేదు.
అక్కడ క్యాండిల్స్ మరియు ఇతర ఏర్పాట్లు చూస్తే మాత్రం చేతబడి చేస్తున్నట్లుగా అనిపిస్తుందని పోలీసులు అంటున్నారు.