యోగా వల్ల ఎన్ని అద్బుత ప్రయోజనాలు ఉన్నాయో చెబుతూ ఉంటే అంతా కూడా పెద్దగా పట్టించుకోరు.కాని యోగా వల్ల లాభపడ్డ వారిని చూస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే.
యోగా గురువు బాబా రామ్దేవ్ ఈ వయస్సులో కూడా చాలా యాక్టివ్గా ఉండటంకు కారణం యోగా అనడంలో ఎలాంటి సందేహం లేదు.యోగా వల్ల ఆయుశ్సు పెరగడంతో పాటు, అద్బుతమైన మేదస్సు కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ప్రతి ఒక్కరు కూడా యోగా చేయడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు పొందుతారు అంటూ మరోసారి కాలిఫోర్నియాకు చెందిన యోగా టీచర్ అలైస్ వాస్కెజ్ను చూస్తుంటే అర్థం అయ్యింది.
కాలిఫోర్నియాకు చెందిన అలైస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది.
ఆమెకు స్థానికంగా చాలా మంచి ఫేమ్ దక్కింది.ఆమెను స్థానికంగా గుర్తు పట్టిన వారు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడతారు.
పాతికేళ్ల అమ్మాయిగా కనిపించే ఆమెకు కుర్రకారు లైన్ కూడా వేస్తారు.అయితే ఆమె తాజాగా ఒక బాంబు పేల్చింది.
ఒక బీచ్లో ఈమె ముగ్గురు పిల్లలతో ఆడుతోంది.అక్కడికి కొందరు వెళ్లి ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టారు.
ఆ సమయంలో ఆమె వద్ద ఉన్న పిల్లల గురించి ఎవరో ప్రశ్నించగా, వీరు నా కొడుకు పిల్లలు అంటూ అవాక్కయ్యే మాట చెప్పింది.మొదట ఆమె చెప్పింది ఫ్రాంక్ అని, ఆమె అబద్దం ఆడుతుందని అంతా భావించారు.
కాని అనూహ్యంగా ఆమె చెప్పింది నిజమే అని వారికి తెలిసింది.
అలైస్ కు 35 ఏళ్ల కొడుకు ఉన్నాడని, అతడి పిల్లలే ఈ ముగ్గురు పిల్లలు.ఆ పిల్లలకు నాయనమ్మ అయిన అలైస్ వారికి తల్లి అంటే కూడా నమ్మే విధంగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
అలైస్ ఎంత అనే విషయం చెప్పక పోయినా ఆమెకు 55 నుండి 60 ఏళ్ల వరకు ఉండి ఉంటాయనే అంచనాకు వచ్చారు.
తన ఆరోగ్య రహస్యం, తన గ్లామర్ రహస్యం యోగా మరియు శాఖాహారం అంటూ చెప్పుకొచ్చింది.తాను ఎన్నో ఏళ్లుగా యోగా చేస్తున్నాను, దాంతో పాటు నేను కేవలం శాఖాహారం మాత్రమే తింటాను.
ఇక తనకు మందు, స్మోకింగ్, డ్రగ్స్ వంటి అలవాట్లు లేవంది.అవన్ని అలవాట్లు లేకపోవడంతో పాటు యోగా చేయడం వల్ల తాను ఇలా ఉన్నానంటూ ఆమె చెప్పింది.
ప్రపంచంలోనే అంత్యంత యవ్వన వంతురాలిగా కనిపించే బామ్మగా ఈమె రికార్డు దక్కించుకుందని చెప్పుకోవచ్చు.