అక్రమ ఆస్తుల కేసులో కర్నాటక జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ వచ్చే నెల 27 న విడుదల కానున్నది.ఈ నేపథ్యంలో ఆమె న్యుమోనియా, జ్వరం తో బాదపడుతూ కర్నాటక జైల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ఈ క్రమంలో ఆమె కు దగ్గు,జ్వరం అధిక అవ్వడంతో అనుమానం వచ్చిన డాక్టర్స్ వెంటనే విక్టోరియా హాస్పటల్ కు తరలించారు.అక్కడ ఆమెకు ఆర్టిపిసిఆర్ సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమెకు కరోన గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది.కరోనా తోపాటుగా మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులతో ఆమె బాదపడుతుందని తెలుస్తుంది.
ఆమెను పరామర్శించేందుకు ఏఎంఎంకే అధినేత ధీనకరన్ మరియు ఆమె కుటుంబ వైద్యుడు వెంకటేష్ ఆయన అసిస్టెంట్ కార్తికేయన్ కొంత మంది ముఖ్య నేతలు విక్టోరియా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించేందుకు వెళ్ళారు.ఆమె కరోనా తో బాద పడుతున్న కారణంగ ఆసుపత్రి సిబ్బంది ధీనకరన్ ఒక్కరిని మాత్రమే అనుమతి ఇచ్చారు.ఆమెను పరామర్శించిన పిమ్మట ఆయన మాట్లాడుతూ… శశికళను వెంటనే బెంగళూర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించాలని కోరాడు.ఆమె క్షేమంతో తిరిగిరావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అన్నాడు.
తమిళనాడు ప్రజలు కూడా ఆమె రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
.