తమిళనాడులో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.అధికార ప్రతి పక్ష పార్టీ నాయకులు ఇప్పటికే తమ ప్రచారంలో బిజీగా ఉన్నారు.
ఏ పార్టీ అయిన సరే అధికారంలోకి రావాలంటే ప్రజలను ప్రసన్నం చేసుకోవాలి.ఇప్పుడు అక్కడ ఉన్న పార్టీలు అదే పనిలో బిజీగా ఉన్నాయి తమ తమ పార్టీ ప్రచారంలో భాగంగా హామీలను కురిపిస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన AIDMK పార్టీ అమ్మ బొమ్మతో ఫ్యాన్.అమ్మ మిక్సీ, అమ్మ ల్యాప్ టాప్ ఇలా ఎన్నో రకాల హామీలను తమ మ్యానిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చింది.
తమిళనాట ఇలాంటి హామీలు అధికారంలోకి రావడానికి కీలక పాత్రను పోషిస్తాయి.ప్రతిపక్ష పార్టీ అయిన డిఎంకే అధినేత స్టాలిన్ ఒకానొక సభలో మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే విద్యార్థులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చాడు.ఇప్పుడిప్పుడే అక్కడ బలమైన పార్టీగా ఎదుగుతున్న మక్కల్ నిధి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మహిళలపై వరాల జల్లు కురిపించాడు.ఈ సందర్భంగా కమల్ పార్టీ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే గృహిణిలకు వేతనాలు చెలిస్తాంని ప్రకటించాడు.
కమల్ తీసుకున్న నిర్ణయాని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశిథరూర్ స్వాగతించాడు.