థియేటర్లు మూతబడి ఉండటంతో పాటు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉంది.దీంతో షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యి ఉన్న సినిమాలు అన్ని కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇదే సమయంలో నిర్మాతలకి ఆశాదీపంలాగా ఓటీటీ చానల్స్ కనిపించాయి.ఇక ఈ కరోనా టైంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఫుల్ బూమ్ వచ్చింది.
థియేటర్లు లేకపోవడంతో ప్రేక్షకులు ఇంట్లో కూర్చొని హ్యాపీగా వెబ్ సిరీస్ లు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.దీంతో ఓటీటీ చానల్స్ కి విపరీతమైన ఆదరణ పెరిగింది.
వాటిని వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.ఈ చానల్స్ కూడా రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలని కొనేసి తమ ఛానల్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
నిర్మాతలకి లాభసాటిగా ఉండటంతో ఛానల్స్ వాళ్ళు ఆఫర్ చేసే రేటుకి తమ సినిమాలు అమ్మేసి రిలీజ్ కి సిద్ధం చేసేస్తున్నారు.బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరికి ఇప్పుడు ఇదే దారి.
తాజాగా అమెజాన్ ప్రైమ్ లో అనుష్క పాన్ ఇండియా మూవీ నిశ్శబ్దం కూడా రిలీజ్ కన్ఫర్మ్ చేసుకుంది.
కొంత మంది కుర్ర హీరోలు ఓటీటీ రిలీజ్ చేసే ప్రసక్తే లేదని బెట్టు చేస్తున్న ఎక్కువ కాలం ఈ బెట్టు మీద నిలబడే పరిస్థితి కనిపించడం లేదు.
ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ కూడా తమ కొత్త సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు.తాను హీరోగా నటించిన శ్రీకారం చిత్రం డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
నూతన దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వాస్తవానికి వేసవిలోనే విడుదల కావాలి.థియేటర్లు మూతపడడం వల్ల ఆగిపోయింది.
ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం సాధ్యపడదన్న వార్తలు వస్తుండడంతో నిర్మాతలు డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.