శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి ‘మహాసముద్రం’ అనే చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే.నాగచైతన్య మరియు మరో ఇద్దరు హీరోలు కూడా నో చెప్పిన తర్వాత ఈ సినిమాను శర్వానంద్ చేసేందుకు ముందుకు వచ్చాడు.
ఈ కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత మహాసముద్రం చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది అంటున్నారు.వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఈ సమయంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మహాసముద్రంలో హీరో సగానికి పైగా నెగటివ్ షేడ్స్ను కలిగి ఉంటాడట.
అంటే గద్దలకొండ గణేష్ చిత్రంలో వరుణ్ తేజ్ మాదిరిగా.సినిమాలో శర్వా ఆ స్థాయిలో కాకున్నా కాస్త కన్నింగ్గా నెగటివ్ షేడ్స్తో కనిపిస్తాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈయన గతంలో ఆర్ఎక్స్ 100 చిత్రంను తెరకెక్కించాడు.మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు సక్సెస్ అందుకున్నాడు.ఇప్పుడు ఈ సినిమాతో రాబోతున్నాడు.
మొదటి సినిమాలో హీరోయిన్ను నెగటివ్ షేడ్స్లో చూపించిన దర్శకుడు అజయ్ ఈసారి హీరోను నెగటివ్ షేడ్స్తో చూపించేందుకు రెడీ అయ్యాడు.హీరోయిన్ను కాస్త నెగటివ్ అయితే చూశారు.ఆమె గ్లామర్ ముందు నెగటివ్ షేడ్స్ ఎక్కువగా చర్చకు రాలేదు.
కాని హీరోను విలన్గా చూపిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గద్దలకొండ గణేష్ వంటి రేర్ కేసుల్లో మాత్రమే హీరోను విలన్గా ఒప్పుకుంటారు.
మరి మహాసముద్రం విషయంలో ఎలా ఉంటుందో చూడాలి.