టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీ ‘జాను’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.
కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.దీంతో శర్వానంద్ పెట్టుకున్న నమ్మకాలు అన్ని కూడా ఆవిరై పోయాయి.
ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాలతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ హీరో.
కాగా ఇప్పటికే శ్రీకారం అనే సినిమాను తెరకెక్కిస్తున్న శర్వానంద్, ఆ తరువాత మరో సినిమాను ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
‘మహాసముద్రం’ అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వానంద్ పూర్తి మాస్ లుక్లో కనపించనున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు ప్రకాష్ అనే ఓ కొత్త డైరెక్టర్ తెరకెక్కించే చిత్రంలో శర్వా ఓ ఛాలెంజింగ్ రోల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఓ వికలాంగుడి పాత్రలో శర్వానంద్ నటిస్తున్నాడని చిత్ర యూనిట్ పేర్కొంది.దర్శకుడు ప్రకాష్ చెప్పిన కథ శర్వాకు బాగా నచ్చడంతో ఈ వికలాంగుడి పాత్రలో నటించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో శర్వా యాక్టింగ్ మరో లెవెల్లో ఉంటుందని, ఆయన కెరీర్లోనే ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఏదేమైనా ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలంటే ధైర్యం ఉండాలని, శర్వానంద్ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడని పలువురు అంటున్నారు.
మరి శర్వానంద్ శ్రీకారం చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేక ఫ్లాప్ పరంపరను కొనసాగిస్తాడా అనేది చూడాలి.