యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్లుగా నిలవడంతో శర్వా ట్రాక్ తప్పుతున్నాడు.ఇటీవల స్టార్ బ్యూటీ సమంతతో కలిసి తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేసినా అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.
దీంతో శర్వా తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు.
దర్శకడు కిషోర్ రెడ్డి డైరెక్షనలో శ్రీకారం అనే సినిమాలో నటిస్తున్నాడు శర్వా.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోగా, ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.అయితే ఈ సినిమా పూర్తి విలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుండటంతో, ఈ సినిమా కథ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కానీ ఈ సినిమాలో కొత్త మ్యాటర్ ఏమీ లేదని ఈ సినిమా క్లైమాక్స్ సీన్ గురించి వింటే తెలుస్తోంది.
ఈ సినిమాలో రైతులు పడుతున్న కష్టాలను మరోసారి ప్రేక్షకులకు చూపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా క్లైమాక్స్ కూడా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలోలా ఉంటుందని తెలుస్తోంది.అంతేగాక సినిమాలో చాలా సీన్స్ చూస్తే ఇది మహర్షి సినిమాలో చూశామని ప్రేక్షకులు అనుకుంటారట.
మరి ఈ సినిమాలో శర్వానంద్ కొత్తగా ఏం చూపిస్తాడో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.