యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల నటించిన జాను చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే.ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్న శర్వాకు నిరాశ ఎదురవ్వడంతో, తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు.
శ్రీకారం అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై శర్వా భారీ నమ్మకాలు పెట్టుకున్నాడు.
ఇప్పటికే షూటింగ్తో బిజీగా ఉన్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇది ప్రస్తుతం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేసిన శర్వా, ప్రస్తుతం యూఎస్లో ఉన్నాడు.ఇండియాకు వచ్చిన తరువాత సినిమాకు సంబంధించిన మిగతా షూటింగ్ను పూర్తి చేస్తాడు.22 రోజుల షూటింగ్ మిగిల ఉండటంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు.
దీంతో ఈ సినిమాను ముందుకు అనుకున్నట్లుగా ఏప్రిల్ 25న రిలీజ్ చేయడం కుదరదని, జూన్ నెలలో రిలీజ్ చేసేందుకే చిత్ర యూనిట్ మక్కువ చూపిస్తున్నారు.మే నెలలో భారీ చిత్రాల నుండి చిన్న సినిమాల వరకు క్యూ కట్టి ఉండటంతో జూన్లోనే ఈ సినిమా రిలీజ్ కుదురుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరి సమ్మర్ నుండి తప్పుకున్న శ్రీకారం చిత్రం శర్వాకు ఎలాంటి రిజల్ట్ను ఇస్తుందో చూడాలి.