తెలుగు ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు.ఈయన మొదటి సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకోలేదు.
తన కెరీర్ లో చాలా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చాడు.కెరీర్ మొదటి నుండి తనకు తగిన పాత్రలను ఎంచుకుంటూ డీసెంట్ హిట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఎప్పుడూ కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు.
శర్వానంద్ నటించిన తాజా సినిమా శ్రీకారం శివరాత్రి కానుకగా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు కానీ విమర్శకుల ప్రశంసలు అయితే అందాయి.రైతుల కష్టాల గురించి వారు పడే బాదల గురించి క్లుప్తంగా చూపించి ఆధునిక పద్దతిలో సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం చేయడం వల్ల రైతుల కు జరిగే మంచి ఏమిటో ఈ సినిమాలో చూపించారు.
ఈ సినిమాను డైరెక్టర్ కిషోర్ తెరకెక్కించాడు.
ఈ సినిమాను 14 రీల్స్ నిర్మించారు.
అయితే శర్వానంద్ పేరు ఎప్పుడు వివాదాల్లో వినిపించలేదు.
ఆయన తన సినిమాల ఫంక్షన్లలో తప్ప బయట కూడా ఎక్కువగా కనిపించదు.అయితే ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారని వార్తలు వస్తున్నాయి.శ్రీకారం సినిమా నిర్మాతలకు శర్వానంద్ కు మధ్య వివాదం జరుగుతున్నట్టు టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమా పారితోషికం విషయంలో 14 రీల్స్ వారికీ శర్వా కు మధ్య వివాదం చెలరేగినట్టు తెలుస్తుంది.ఆ సినిమాకు ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా పెండింగ్ ఉందట.
నిర్మాతలను అడుగుతున్నా ఎలాంటి స్పందన లేకపోవడం తో నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారని టాక్.మరి ఈ వివాదంలో నిజ నిజాలు తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.
ప్రస్తుతం శర్వానంద్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘మహాసముద్రం‘ సినిమాలో నటిస్తున్నాడు.