కార్యరెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ను ప్రారంభించిన శర్వానంద్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ యువ హీరోల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు.ఇంతటి క్రేజ్ ‘ప్రస్తానం’ చిత్రం వల్లే వచ్చింది అనే విషయాన్ని ఆయన కూడా ఒప్పుకోవాల్సిందే.
దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలలో శర్వానంద్ చూపిన నటన, శర్వానంద్ను దర్శకుడు చూపించిన తీరు సినిమాకు ప్రధాన ఆకర్షనగా నిలిచ్చాయి.అంతటి క్రేజ్ను తెచ్చి పెట్టిన శర్వానంద్ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు.
అయితే దర్శకుడు దేవకట్టా మాత్రం బ్రేక్ కోసం పరితపిస్తున్నాడు.
‘ఆటోనగర్ సూర్య’ ఫ్లాప్ తర్వాత చాలా కాలంకు ‘డైనమైట్’ రూపంలో మంచు విష్ణు అవకాశం ఇచ్చాడు.
అయితే ఆ సినిమా రీమేక్ అవ్వడంతో దేవ కట్టా తన పూర్తి సామర్థ్యంను వినియోగించలేక పోయాడు.తాజాగా ఈ దర్శకుడు ఒక వైవిధ్యభరిత స్క్రిప్ట్ను పట్టుకుని శర్వానంద్ వద్దకు వెళ్లడం జరిగిందట.
స్క్రిప్ట్ మొత్తం ఓపికగా విన్న శర్వానంద్ ఇప్పుడు తాను ఇతర సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను అని, ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి కావాలంటే కనీసం రెండున్నర మూడు సంవత్సరాలు అయినా పట్టే ఛాన్స్ ఉందని, అందుకే మరో హీరోను వెదుకోవాల్సిందిగా దేవ కట్టాకు సలహా ఇచ్చాడట.దాంతో తాజాగా శర్వానంద్పై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
శర్వానంద్ కెరీర్కు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన దర్శకుడిని పట్టించుకోకుండా, ఆయనకు హ్యాండ్ ఇవ్వడం సరైన పద్దతి కాదని, దేవ కట్టా దర్శకత్వంలో శర్వానంద్ నటించాల్సి ఉందని కొందరు అంటున్నారు.మరి ఇప్పటికి అయినా శర్వానంద్ మనస్సు మార్చుకుని దేవ కట్టా దర్శకత్వంలో నటించేందుకు ముందుకు వస్తాడేమో చూడాలి.